తెలంగాణ

telangana

By

Published : Oct 17, 2020, 10:26 AM IST

ETV Bharat / state

'ఇబ్రహీంపట్నం పరిధిలో భూములు ఆక్రమిస్తే ఉపక్షించేది లేదు'

హైదరాబాద్‌ ఇబ్రహీంపట్నం పరిధిలోని ఇంజాపూర్‌ వాగులో కొట్టుకుపోయి మృతి చెందిన యువకుల కుటుంబాలను స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి పరామర్శించారు. 5లక్షల పరిహారం అందజేస్తామని హామీ ఇచ్చారు. నియోజకవర్గం పరిధిలో ఎవరైనా ఆక్రమణలు చేస్తే ఉపక్షించేది లేదని హెచ్చరించారు.

mla manchireddy kishan reddy at injapur in hyderabad
'ఇబ్రహీంపట్నం పరిధిలో భూములు ఆక్రమిస్తే ఉపక్షించేది లేదు'

హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షాలకు ఇంజాపూర్ వాగులో కొట్టుకుపోయి మృతి చెందిన యువకుల కుటుంబాలను ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి పరామర్శించి... మృతులకు నివాళులర్పించారు. ఇద్దరు యువకులు వాగులో కోట్టుకుపోయి ప్రాణాలు కోల్పోవడం బాధకరమన్నారు. వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం అందజేశారు.

మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపి... ప్రభుత్వం ద్వారా రూ.5 లక్షల పరిహారం అందజేస్తామని హామీ ఇచ్చారు. నియోజకవర్గం పరిధిలో చెరువులు, కుంటలు, నాలాలు ఎవరైనా ఆక్రమిస్తే... ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇదీ చదవండి:పిల్లల కోసం ఐపీఎల్​ వదిలేసిన పీటర్సన్​!

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details