జీహెచ్ఎంసీ పరిధిలోని కుత్బుల్లాపూర్లో ఎమ్మెల్యే కేపీ వివేకానంద పర్యటించారు. రెవెన్యూ సంబంధిత సమస్యలపై నియోజకవర్గాల్లో పర్యటించాలని మంత్రి కేటీఆర్ సూచనలపై.... రెవెన్యూ అధికారులతో కలిసి నియోజకవర్గంలో పర్యటించి ప్రజల సమస్యలు అడిగి తెసుకున్నారు.
మంత్రి కేటీఆర్ సూచన.. ఎమ్మెల్యే వివేకానంద పర్యటన
జీహెచ్ఎంసీ పరిధిలో రెవెన్యూ సమస్యల పరిష్కార విషయమై మంత్రి కేటీఆర్ సూచనలపై కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వివేకానంద పర్యటించారు. రెవెన్యూ అధికారులతో కలిసి కాలనీల్లో పర్యటించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
కుత్బుల్లాపూర్లో ఎమ్మెల్యే కేపీ వివేకానంద పర్యటన
107 సర్వే నెంబర్లోని ఇళ్ల క్రమబద్ధీకరణ విషయమై మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లగా... ఆయన సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే తెలిపారు. మంత్రి సూచనలపై నియోజకవర్గంలో పర్యటించిన ఆయన ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న భూ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సురారం డివిజన్ పరిధిలోని 71, 72, 73, 74 75, 76, 79 సర్వే నెంబర్లలో ఎన్వోసీ క్లియరెన్సు చేసి శాశ్వత పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు.
ఇదీ చూడండి;రాష్ట్ర సాధనలో బాపూజీ పాత్ర మరవలేనిది: ఎం.ఆర్.ఎం.రావు