తెలంగాణ

telangana

By

Published : Sep 27, 2020, 8:46 PM IST

ETV Bharat / state

మంత్రి కేటీఆర్ సూచన.. ఎమ్మెల్యే వివేకానంద పర్యటన

జీహెచ్​ఎంసీ పరిధిలో రెవెన్యూ సమస్యల పరిష్కార విషయమై మంత్రి కేటీఆర్​ సూచనలపై కుత్బుల్లాపూర్​ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వివేకానంద పర్యటించారు. రెవెన్యూ అధికారులతో కలిసి కాలనీల్లో పర్యటించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

కుత్బుల్లాపూర్​లో ఎమ్మెల్యే కేపీ వివేకానంద పర్యటన
కుత్బుల్లాపూర్​లో ఎమ్మెల్యే కేపీ వివేకానంద పర్యటన

జీహెచ్​ఎంసీ పరిధిలోని కుత్బుల్లాపూర్​లో ఎమ్మెల్యే కేపీ వివేకానంద పర్యటించారు. రెవెన్యూ సంబంధిత సమస్యలపై నియోజకవర్గాల్లో పర్యటించాలని మంత్రి కేటీఆర్​ సూచనలపై.... రెవెన్యూ అధికారులతో కలిసి నియోజకవర్గంలో పర్యటించి ప్రజల సమస్యలు అడిగి తెసుకున్నారు.

107 సర్వే నెంబర్​లోని ఇళ్ల క్రమబద్ధీకరణ విషయమై మంత్రి కేటీఆర్​ దృష్టికి తీసుకెళ్లగా... ఆయన సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే తెలిపారు. మంత్రి సూచనలపై నియోజకవర్గంలో పర్యటించిన ఆయన ఎంతో కాలంగా పెండింగ్​లో ఉన్న భూ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సురారం డివిజన్ పరిధిలోని 71, 72, 73, 74 75, 76, 79 సర్వే నెంబర్లలో ఎన్వోసీ క్లియరెన్సు చేసి శాశ్వత పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు.

ఇదీ చూడండి;రాష్ట్ర సాధనలో బాపూజీ పాత్ర మరవలేనిది: ఎం.ఆర్​.ఎం.రావు

ABOUT THE AUTHOR

...view details