తెలంగాణ

telangana

ETV Bharat / state

'జీహెచ్​ఎంసీలో గతం కంటే 2 స్థానాలు ఎక్కువ గెలుస్తాం'

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో గతం కంటే రెండు స్థానాలు ఎక్కువే గెలుస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. కంటోన్మెంట్‌ ఎన్నికల్లోనూ తెరాసదే హవా ఉంటుందని చెప్పారు.

By

Published : Sep 14, 2019, 3:43 PM IST

GHMC

షెడ్యూల్‌ ప్రకారమే జీహెచ్‌ఎంసీ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ తెలిపారు. అసెంబ్లీ లాబీలో మీడియా ప్రతినిధులతో మంత్రి ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. జీహెచ్ఎంసీ విభజన విషయమై ఎలాంటి ఆలోచన, చర్చ లేదన్నారు. గ్రేటర్​లో గతం కంటే రెండు స్థానాలు ఎక్కువగానే గెలుస్తామని తలసాని ధీమా వ్యక్తం చేశారు. కంటోన్మెంట్‌ ఎన్నికల్లోనూ తెరాసదే హవా ఉంటుందని చెప్పారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవాలన్నారు. చంద్రబాబులా ప్రతిదానికి టెన్షన్ పడే వాతావరణ ఇక్కడ ఉండదని పేర్కొన్నారు.

'జీహెచ్​ఎంసీలో గతం కంటే 2 స్థానాలు ఎక్కువ గెలుస్తాం'

ABOUT THE AUTHOR

...view details