కాంగ్రెస్ ఫిరాయింపులను ప్రోత్సహించినప్పుడు ప్రజాస్వామ్యం గుర్తుకురాలేదా అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశ్నించారు. దమ్ముంటే హస్తం నేతలు ప్రజాక్షేత్రంలో కొట్లాడాలని సవాల్ విసిరారు. లోక్సభ ఎన్నికల్లో తెరాసకు పోటీ కూడా ఇవ్వలేకపోయిందని ఎద్దేవా చేశారు. పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్ నేతలకు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజాస్వామ్యం అప్పుడు గుర్తుకురాలేదా: తలసాని
ఇంటర్ ఫలితాలపై ప్రభుత్వం కమిటీ వేసిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. నివేదిక వచ్చాక ప్రభుత్వం తప్పకుండా చర్యలు చేపడుతుందని చెప్పారు.
ప్రజాస్వామ్యం అప్పుడు గుర్తుకురాలేదా: తలసాని