తెలంగాణ

telangana

కబడ్డీ.. కబడ్డీ.. కూతకెళ్లి సందడి చేసిన రోజా.. ​

By

Published : Nov 28, 2022, 8:17 PM IST

Minister Roja Played Kabaddi: క్రీడా శాఖ మంత్రి రోజా కబడ్డీ ఆడి క్రీడాకారుల్లో జోష్ పెంచారు. ఏపీలోని చిత్తూరు జిల్లా నగరి డిగ్రీ కళాశాలలో జగనన్న క్రీడా సంబరాలను ఆమె ప్రారంభించారు.

Minister Roja Played Kabaddi
Minister Roja Played Kabaddi

Minister Roja Played Kabaddi: ఆంధ్రప్రదేశ్​లోని చిత్తూరు జిల్లా నగరి డిగ్రీ కళాశాలలో జగనన్న క్రీడా సంబరాలను మంత్రి రోజా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె క్రీడాకారులతో కబడ్డీ ఆడి వారిలో ఉత్సాహం నింపారు. క్రీడాభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పలు కార్యక్రమాలు చేపడుతున్నట్లు మంత్రి రోజా తెలిపారు. అలాగే అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి కృషి చేస్తున్నట్లు తెలియజేశారు.

ఈ పోటీల్లో కుప్పం, పలమనేరు, పుంగనూరు, చిత్తూరు, పూతలపట్టు, గంగాధర నెల్లూరు, నగరి నియోజకవర్గాలకు చెందిన క్రీడాకారులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు పార్లమెంట్ సభ్యులు రెడ్డప్ప జేసీ వెంకటేశ్వర్, డీఈఓలు విజయేంద్ర, శేఖర్, ఆర్డీఓ సృజన, ఎమ్మార్వో చంద్రశేఖర్, మున్సిపల్ కమిషనర్ వెంకట్రామి రెడ్డి, సెట్విన్ సీఈవో మురళీకృష్ణ, మేనేజర్ మురళిలు, తదితరులు పాల్గొన్నారు.

కబడ్డీ ఆడిన మంత్రి రోజా.. క్రీడాకారుల్లో జోష్​

ABOUT THE AUTHOR

...view details