తెలంగాణ

telangana

PUVVADA MEET: చిరు, ఎన్టీఆర్​తో పువ్వాడ ప్రత్యేక భేటీ.. ఎందుకంటే?

మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఆయన తనయుడు నయన్ రాజ్​లు మెగాస్టార్ చిరంజీవి, స్టార్ హీరో ఎన్టీఆర్​ను కలిశారు. నయన్ రాజ్ పుట్టిన రోజు సందర్భంగా సినీ ప్రముఖులను కలిసినట్లు మంత్రి ట్వీట్ చేశారు. అలాగే మంత్రి కేటీఆర్​కు పువ్వాడ తన కుమారుడిని పరిచయం చేశారు.

By

Published : Jul 5, 2021, 2:39 PM IST

Published : Jul 5, 2021, 2:39 PM IST

Updated : Jul 5, 2021, 4:24 PM IST

puvvada met chiranjeevi, puvvada met ntr
చిరును కలిసిన పువ్వాడ, ఎన్టీఆర్​ను కలిసిన పువ్వాడ

చిరు సమక్షంలో కేక్ కటింగ్

రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ తన కుమారుడు నయన్ రాజ్ పుట్టిన రోజును సినీ ప్రముఖుల మధ్య జరుపుకున్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్​లోని చిరంజీవి, ఎన్టీఆర్ నివాసాలకు వెళ్లిన పువ్వాడ... తన కుమారుడు నయన్​ను పరిచయం చేసి ఆశీర్వదించాల్సిందిగా కోరారు. మెగాస్టార్ చిరంజీవి నయన్​కు శుభాకాంక్షలు చెబుతూ తన నివాసంలో స్వయంగా కేక్ కట్ చేయించి ఆనందపరిచారు.

చిరును కలిసిన పువ్వాడ

అనంతరం స్టార్ హీరో ఎన్టీఆర్​ను కలిశారు. పువ్వాడ తనయుడికి తారక్​తో పాటు ప్రముఖ దర్శకుడు కొరటాల శివ శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నడూ లేని విధంగా సినీ ప్రముఖల మధ్య పువ్వాడ తనయుడు నయన్ పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం చర్చనీయాంశంగా మారింది. మంత్రి పువ్వాడ తన కుమారుడిని తెలుగు తెరకు పరిచయం చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. అందుకే చిరంజీవి, ఎన్టీఆర్​లతో సమావేశమైనట్లు టాక్ వినిపిస్తోంది.

ఎన్టీఆర్​తో పువ్వాడ ప్రత్యేక భేటి

సినీ ప్రముఖులతో పాటు మంత్రి కేటీఆర్​కు పువ్వాడ తన కుమారుడిని పరిచయం చేశారు. ప్రస్తుతం వైద్య విద్య అభ్యసిస్తున్న నయన్ రాజ్​​కు సినీ రంగమంటే ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.

మంత్రి కేటీఆర్​ను కలిసిన నయన్ రాజ్

ఇదీ చదవండి:Sonu Sood: ఆక్సిజన్​ ప్లాంట్ ఏర్పాటు..​ తెలుగులో ట్వీట్​

Last Updated : Jul 5, 2021, 4:24 PM IST

ABOUT THE AUTHOR

...view details