రెండోదశలో కొవిడ్ తీవ్రరూపం దాల్చుతోంది. రాష్ట్రంలో రోజువారీ కేసులు వేల సంఖ్యలో వస్తున్నాయి. ఇప్పటికే నగరంలో రాత్రి కర్ఫ్యూ విధించారు. కొవిడ్ కేసులు పెరుగుతున్నందున లాక్డౌన్ విధిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన కూలీలు ఇంటిబాట పడుతున్నారు. నగరంలోని ప్రధాన రైల్వేస్టేషన్లన్నీ కూలీలతో కిక్కిరిసిపోతున్నాయి.
కోల్కతా, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, బిహార్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన కూలీలు నగరంలో ఉపాధి పొందుతున్నారు. ఇప్పటికే పలువురికి పనిలేదు. చాలా ప్రాంతాల్లో కొవిడ్ కేసులు భారీగా వస్తున్నాయి. చాలామంది వారి సొంతూళ్లకు వెళ్లిపోయారు. మిగిలిన వారు కూడా పయనమవుతున్నారు. పనులు చేసేందుకు అవసరమైన కూలీలు లేక నిర్మాణ, వ్యాపార రంగాలు కుదేలవుతున్నాయి. కూలీలు లేకపోతే పనులు జరగవని గుత్తేదారులు చేతులెత్తేస్తున్నారు.