తెలంగాణ

telangana

ETV Bharat / state

దేవేందర్​గౌడ్​ను కలిసిన మల్కాజిగిరి ఎంపీ రేవంత్​రెడ్డి

తెలంగాణ అభివృద్ధిలో తెదేపా నేత దేవేందర్​ గౌడ్​ క్రియాశీలక పాత్ర పోషించారని మల్కాజిగిరి ఎంపీ రేవంత్​రెడ్డి ప్రశంసించారు. పార్లమెంటు ఎన్నికల్లో తనకు మద్దతిచ్చి గెలిపించినందుకు ఆయన నివాసంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. కేంద్రం నుంచి నిధులు సక్రమంగా వచ్చేలా ప్రజా గొంతుక వినిపిస్తానని పేర్కొన్నారు.

By

Published : May 29, 2019, 3:23 PM IST

రేవంత్​రెడ్డి

ప్రశ్నించే గొంతుక ఉండాలని ఈ ఎన్నికల్లో ప్రజలు విలక్షణ తీర్పిచ్చారని మల్కాజిగిరి ఎంపీ రేవంత్​రెడ్డి పునరుద్ఘాటించారు. హైదరాబాద్​లో తెదేపా నేత దేవేందర్​ గౌడ్​ను ఆయన మర్యాద పూర్వకంగా కలిశారు. ఎన్నికల్లో మద్దతిచ్చి గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఎక్కడ అభివృద్ధి జరిగినా అందులో దేవేందర్​ గౌడ్​ పాత్ర ఉంటుందని రేవంత్​ ప్రశంసించారు. ముఖ్యంగా జవహర్​నగర్​ డంపింగ్​ యార్డు, ఐటీఐఆర్​ కారిడార్​ ఏర్పాటు వంటి అంశాలపై చర్చించామని అన్నారు. కేంద్రం నుంచి రాబట్టాల్సిన నిధులను తెప్పించే వరకు పోరాడతానని స్పష్టం చేశారు.

దేవేందర్​ గౌడ్​ను కలిసిన రేవంత్​రెడ్డి

ABOUT THE AUTHOR

...view details