కరోనా కట్టడి చర్యల్లో భాగంగా తెలంగాణ సర్కారు తీసుకున్న లాక్డౌన్ నిబంధనను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ నెల 31 వరకు ఎవరూ బయటకు రావొద్దని హెచ్చరిస్తున్నారు. నాంపల్లి, అబిడ్స్, కోఠి, బేగంబజార్ ప్రాంతాల్లో పోలీసులు చెక్ పోస్టులు ఏర్పాటు చేసి విస్తృత తనిఖీలు చేస్తున్నారు.
'లాక్డౌన్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు'
కొవిడ్ 19 నివారణా చర్యల్లో భాగంగా ప్రభుత్వం తీసుకున్న లాక్డౌన్ను ఉల్లంఘించిన వారిపట్ల పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటామంటున్నారు. ఎంతలా చెప్పినా కొందరితీరు మారడం లేదని.. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
'లాక్డౌన్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు'
నిత్యావసరాల కోసం ఒకరు మాత్రమే బయటకు రావాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు. నిత్యావసరాల కోసం మాత్రమే ప్రజలు బయటకురావాలని సూచిస్తున్నారు.
ఇదీ చూడండి:దేశవ్యాప్తంగా లాక్డౌన్... కరోనా కేసులు@471