తెలంగాణ

telangana

ETV Bharat / state

ద్రవరూపంలో గంజాయి.. స్మగ్లర్ల కొత్త ఎత్తుగడ..!

సంగారెడ్డి జిల్లా అమీన్​పూర్​లోని ఓ అపార్ట్​మెంట్​లో గంజాయి ద్రావణాన్ని తయారు చేసి విక్రయిస్తున్న నలుగురు యువకుల్ని పోలీసులు పట్టుకున్నారు. అనంతరం వారి నుంచి ఆ ద్రావణాన్ని స్వాధీనం చేసుకున్నారు.

By

Published : May 4, 2019, 4:21 PM IST

Updated : May 4, 2019, 4:26 PM IST

హైదరాబాద్​లో లిక్విడ్ గంజాయి దందా

సంగారెడ్డి జిల్లా అమీన్​పూర్​లోని ఓ అపార్ట్​మెంట్లో ఉంటున్న నలుగురు యువకులు గంజాయి ద్రావణాన్ని తయారుచేస్తున్నారు. సమాచారం తెలుసుకున్న విజిలెన్స్​ అధికారులు అపార్ట్​మెంట్​లో సోదాలు చేశారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి 8 లక్షల రూపాయలు విలువ చేసే గంజాయి ద్రావణం, కారు, రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు.

హైదరాబాద్​లో లిక్విడ్ గంజాయి దందా

వైజాగ్​ గాంజా... హైదరాబాద్​లో దందా

వైజాగ్ నుంచి గంజాయి ద్రావణాన్ని తీసుకొచ్చి చిన్న సీసాల్లో నింపి బెంగళూర్​తో పాటు హైదరాబాద్​లోని పలు ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. ఈ దందా ఎప్పటి నుంచి నిర్వహిస్తున్నారనే దానిపై స్థానిక పోలీసులతో కలిసి దర్యాప్తు చేస్తున్నామని విజిలెన్స్, ఎన్​ఫోర్స్​మెంట్ ఎస్పీ అన్నపూర్ణ తెలిపారు.

ఇదీ చూడండి : బెంగళూరు, ఫ్రెంచ్​ ఫ్రై... ఐపీఎల్​లో టాప్​ ఇవే

Last Updated : May 4, 2019, 4:26 PM IST

ABOUT THE AUTHOR

...view details