తెలంగాణ

telangana

ETV Bharat / state

గాంధీనగర్​ వైన్స్​షాపులో చోరీ..

లాక్​డౌన్ నేపథ్యంలో మద్యం దొరక కొందరు మందుబాబులు దొంగతనానికి పాల్పడిన ఘటన హైదరాబాద్​ గాంధీనగర్​లో చోటుచేసుకుంది. సుమారు రూ. 60 వేల విలువైన మద్యం బాటిళ్లు, రూ.15 వేలు నగదు చోరీ జరిగిందని దుకాణదారులు చెప్తున్నారు.

By

Published : Apr 4, 2020, 8:44 PM IST

liqueur bottles theft in wine shop at Hyderabad
గాంధీనగర్​ వైన్స్​షాపులో చోరీ..

హైదరాబాద్ గాంధీనగర్ పోలీస్​స్టేషన్ పరిధిలోని వైన్స్​​షాపులో దొంగతనం జరిగింది. గాంధీ ఆసుపత్రి సమీపంలోని శ్రీ వెంకటేశ్వర వైన్స్​ దుకాణం వెనక వైపు నుంచి గుర్తుతెలియని వ్యక్తులు గ్రిల్స్ తొలగించుకుని లోపలికి వెళ్లి చోరీకి పాల్పడ్డారు. దాదాపు రూ. 60వేల విలువైన మద్యం సీసాలు, రూ. 15 వేల నగదును కొల్లగొట్టారని దుకాణం సిబ్బంది తెలిపారు.

దొంగలు లోపలికి ప్రవేశించిన విషయం సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైన ఉందని ఈ విషయాన్ని తమ యజమాని షాపు మూసేసి ఉన్న కారణాన తన చరవాణీలో ఒకటో తేదీన గుర్తించారని వారు చెప్పారు. ఈ విషయంపై గాంధీనగర్ పోలీస్టేషన్​లో ఫిర్యాదు చేసినట్లు ఆయన వివరించారు. మద్యం బాబులే ఈ దురాగతానికి పాల్పడిన ఉండొచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు.

గాంధీనగర్​ వైన్స్​షాపులో చోరీ..

ఇవీ చూడండి: సీరియస్​గా తీసుకోకపోతే ముప్పు తప్పదు: మంత్రి కేటీఆర్

ABOUT THE AUTHOR

...view details