హైదరాబాద్ గాంధీనగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని వైన్స్షాపులో దొంగతనం జరిగింది. గాంధీ ఆసుపత్రి సమీపంలోని శ్రీ వెంకటేశ్వర వైన్స్ దుకాణం వెనక వైపు నుంచి గుర్తుతెలియని వ్యక్తులు గ్రిల్స్ తొలగించుకుని లోపలికి వెళ్లి చోరీకి పాల్పడ్డారు. దాదాపు రూ. 60వేల విలువైన మద్యం సీసాలు, రూ. 15 వేల నగదును కొల్లగొట్టారని దుకాణం సిబ్బంది తెలిపారు.
గాంధీనగర్ వైన్స్షాపులో చోరీ..
లాక్డౌన్ నేపథ్యంలో మద్యం దొరక కొందరు మందుబాబులు దొంగతనానికి పాల్పడిన ఘటన హైదరాబాద్ గాంధీనగర్లో చోటుచేసుకుంది. సుమారు రూ. 60 వేల విలువైన మద్యం బాటిళ్లు, రూ.15 వేలు నగదు చోరీ జరిగిందని దుకాణదారులు చెప్తున్నారు.
గాంధీనగర్ వైన్స్షాపులో చోరీ..
దొంగలు లోపలికి ప్రవేశించిన విషయం సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైన ఉందని ఈ విషయాన్ని తమ యజమాని షాపు మూసేసి ఉన్న కారణాన తన చరవాణీలో ఒకటో తేదీన గుర్తించారని వారు చెప్పారు. ఈ విషయంపై గాంధీనగర్ పోలీస్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు ఆయన వివరించారు. మద్యం బాబులే ఈ దురాగతానికి పాల్పడిన ఉండొచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఇవీ చూడండి: సీరియస్గా తీసుకోకపోతే ముప్పు తప్పదు: మంత్రి కేటీఆర్