తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎల్బీనగర్​ పైవంతెన ప్రారంభం

ఎల్బీనగర్​ కూడలిలోని ఫ్లైఓవర్​ ప్రారంభమైంది. రాష్ట్ర హోంమంత్రి మహమూద్​ అలీ, ఇతర మంత్రులు తలసాని, మల్లారెడ్డి ఫ్లైఓవర్​ను ప్రారంభిచారు.

By

Published : Mar 1, 2019, 2:28 PM IST

ఎల్బీనగర్​ పైవంతెన ప్రారంభం

ఎల్బీనగర్​ పైవంతెన ప్రారంభం

ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న ఎల్బీనగర్ పైవంతెన అందుబాటులోకి వచ్చింది. మంత్రులు మహమూద్​ అలీ, తలసాని, మల్లారెడ్డి ఫ్లైఓవర్​ను ప్రారంభిచారు. ఎస్​ఆర్​డీపీ నిధుల్లో భాగంగా రూ. 42కోట్ల వ్యయంతో దీన్ని నిర్మించారు. భాగ్యనగరానికి ఎల్బీనగర్​ ప్రధానద్వారం కావడం వల్ల నిత్యం ట్రాఫిక్​ సమస్యలతో సతమతమవ్వాల్సి వచ్చేదని, ఇప్పడది తీరిపోయిందని మంత్రి తలసాని అన్నారు.
భాగ్యనగరం దేశానికే ఆదర్శం
నగరాభివృద్ధికి తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ విశేషంగా కృషిచేస్తున్నారని హోంమంత్రి మహమూద్​ అలీ అన్నారు. ఎన్నికల హామీల్లో భాగంగా తెరాస ప్రభుత్వం ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చుతుందని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. భాగ్యనగరం దేశానికే తలమానికంగా మారనుందని తెలిపారు. ఫ్లైఓవర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మేయర్​ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యే సుధీర్​ రెడ్డి, ఇతర నేతలు, అధికారులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details