తెలంగాణ

telangana

బుక్‌ మై డయాగ్నస్టిక్స్​ డాట్​ కాం యాప్​ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే వివేకానంద

మెరుగైన వైద్య నిర్ధరణ పరీక్షల కోసం బీఎండీ సంస్థ ప్రత్యేకమైన యాప్​, వెబ్​సైట్​లను అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని కుత్బుల్లాపూర్​ ఎమ్మెల్యే వివేకానంద అన్నారు. బంజారాహిల్స్​లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బుక్‌ మై డయాగ్నస్టిక్స్​ డాట్‌ కాం యాప్‌ను ఆయన ఆవిష్కరించారు.

By

Published : Feb 14, 2021, 6:17 PM IST

Published : Feb 14, 2021, 6:17 PM IST

డయాగ్నస్టిక్స్​ డాట్​ కాం యాప్​ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే
డయాగ్నస్టిక్స్​ డాట్​ కాం యాప్​ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రస్తుతం ఎదురవుతున్న సవాళ్లను అధిగమిస్తున్నామని కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే వివేకానంద అన్నారు. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని ఓ హోటల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బుక్‌ మై డయాగ్నస్టిక్స్​ డాట్‌ కాం యాప్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు బొడ్డు అశోక్‌, ఆదిత్య, ప్రవీణ్‌, సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. కొవిడ్ సమయంలో ఎంతోమంది వైద్య పరీక్షలు, చికిత్సల కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని అలాంటి వారికి ఇంటి వద్దనే వైద్య పరీక్షలు, ఆన్​లైన్ ద్వారా చికిత్సలు అందించే విధానం ఎంతగానో తోడ్పడిందన్నారు. నగరంలోని ముఖ్యమైన డయాగ్నస్టిక్ సెంటర్లతో ఒప్పందం కుదుర్చుకొని మెరుగైన వైద్య నిర్ధరణ పరీక్షల కోసం బీఎండీ సంస్థ ప్రత్యేకమైన యాప్, వెబ్​సైట్​లను అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు.

వివిధ రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఇంటి వద్దనే వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు వారి నివేదికలను వేగవంతంగా అందించడమే లక్ష్యంగా తమ సంస్థ ఈ సేవలను అందుబాటులోకి తెచ్చినట్లు డాక్టర్ నీలా శ్రీనివాస్ తెలిపారు. ప్రస్తుతం నగరంలో సేవలు ప్రారంభించిన తమ సంస్థ త్వరలోనే మరిన్ని నగరాల్లో అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తుందని తెలిపారు.

ఇదీ చదవండి: తెరాస పాలనలో అన్ని వర్గాల ప్రజలు నష్టపోయారు : ఉత్తమ్​

ABOUT THE AUTHOR

...view details