తెలంగాణ

telangana

ETV Bharat / state

స్నేహితుడిని హత్య చేసి... ఇంట్లోనే మృతదేహాన్ని పెట్టుకున్నాడు

హైదరాబాద్​ కేపీహెచ్​బీ కాలనీలో సాఫ్ట్​వేర్​ ఉద్యోగి సతీశ్​ను... అతని స్నేహితుడు దారుణంగా హత్య చేశాడు. వ్యాపార లావాదేవీలే కారణంగా పోలీసులు భావిస్తున్నారు.

By

Published : Aug 30, 2019, 10:03 AM IST

KPHB

హైదరాబాద్‌ కేపీహెచ్‌బీ కాలనీ ఫేజ్‌-7లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి హత్య జరిగింది. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి సతీశ్‌ను అతని స్నేహితుడే చంపినట్లు పోలీసులు భావిస్తున్నారు.

అసలేం జరిగిందంటే...

ప్రకాశం జిల్లా మార్టూరుకి చెందిన సతీశ్​.. ఐటీ స్లెట్​ సొల్యూషన్స్​ అనే కంపెనీ స్థాపించి తనతో పాటు హేమంత్​ అనే పార్టనర్​తో నడుపుతున్నాడు. అయితే నిన్న ఇంటికి రాలేదు. భర్త కనిపించడం లేదని అతని భార్య ప్రశాంతి కేపీహెచ్​బీ పోలీసు స్టేషన్​లో ఫిర్యాదు చేసింది. పోలీసులు అదృశ్యం కింద కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తులో ... అతని వ్యాపార భాగస్వామి హేమంత్​ ఇంట్లో సతీశ్ మృతదేహం దొరికింది. ఈ హత్య అతనే చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. వ్యాపార లావాదేవీలే కారణంగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

స్నేహితుడిని హత్య చేసి... ఇంట్లోనే మృతదేహాన్ని పెట్టుకున్నాడు

ఇవీ చూడండి:క్యూనెట్​ కేసులో 70 మంది అరెస్ట్​

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details