హైదరాబాద్ చాంద్రాయణగుట్ట నియోజవర్గంలోని 807 మంది లబ్ధిదారులకు షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. స్థానిక బండ్లగూడ మండల పరిషత్ కార్యాలయంలో కొవిడ్ నిబంధనలు పాటిస్తూ కార్పొరేటర్లు చెక్కులు అందజేశారు.
చాంద్రాయణగుట్టలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ
హైదరాబాద్ చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలో స్థానిక కార్పొరేటర్ల ఆధ్వర్యంలో బండ్లగూడ మండల పరిషత్ కార్యాలయంలో 807 మంది లబ్ధిదారులకు రూ. 7.78 కోట్ల విలువైన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.
చాంద్రాయణగుట్టలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ
799 మంది లబ్ధిదారులకు రూ. 7.70 కోట్ల విలువైన షాదీముబారక్ చెక్కులను, 8 మందికి రూ. 8.92 లక్షల విలువైన కల్యాణలక్ష్మి చెక్కులను కార్పొరేటర్లు అందజేశారు. కార్యక్రమంలో బండ్లగూడ తహసీల్దార్తో పాటు మరో ఏడు డివిజన్ల కార్పొరేటర్లు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: మంత్రి హరీశ్రావుకు కరోనా పాజిటివ్