తెలంగాణ

telangana

By

Published : Sep 20, 2020, 4:31 PM IST

ETV Bharat / state

'బోరబండను బంగారుబండగా మార్చడమే మా లక్ష్యం'

బోరబండను బంగారు బండగా అభివృద్ధి పథంలో నడిపించడమే తమ లక్ష్యమని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. నియోజకవర్గంలోని బోరబండ డివిజన్​లో పలు అభివృద్ధి పనులతో పాటు బంజార​నగర్, రాజునగర్​​లో నూతనంగా నిర్మించిన కమిటీ హాల్​ను డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్​తో కలిసి ప్రారంభించారు.

'బోరబండను బంగారుబండగా మార్చడమే మా లక్ష్యం'
'బోరబండను బంగారుబండగా మార్చడమే మా లక్ష్యం'

జూబ్లీహిల్స్​ నియోజకవర్గ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్​లో బోరబండలో పర్యటించారు. డిప్యూటీ మేయర్​ బాబా ఫసియుద్దీన్​తో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు, బంజర​నగర్, రాజునగర్​​లో నిర్మించిన కమిటీ హాల్​ను ప్రారంభించారు. బోరబండ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చేందుకు తన వంతు కృషిచేస్తున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.

తెరాస ప్రభుత్వ హయాంలో బోరబండను బంగారు బండగా మార్చుతున్నట్లు డిప్యూటీ మేయర్​ బాబా ఫసియుద్దీన్​ పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక తెరాస పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:ఇష్టం వచ్చినట్టు బిల్లులు చేస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరు: తలసాని

ABOUT THE AUTHOR

...view details