సీఎంఆర్ఎఫ్కు ఐఆర్ఎస్ అధికారుల విరాళం
కరోనా వైరస్పై పోరులో తమ వంతు సాయంగా ఐఆర్ఎస్ అధికారులు విరాళం అందించారు. రాష్ట్రంలో పనిచేస్తున్న ఆదాయపన్ను, కస్టమ్స్, జీఎస్టీ అధికారులు మూడు లక్షల 60 వేల రూపాయలను ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళంగా అందించారు. రాష్ట్ర ఐఆర్ఎస్ అధికారుల సంఘం తరఫున హైదరాబాద్ జోనల్ యూనిట్ ప్రతినిధులు మంత్రి కేటీఆర్ను కలిసి చెక్ అందించారు. పీఎం కేర్తో పాటు సీఎంఆర్ఎఫ్కు విరాళాలు ఇచ్చిన ఐఆర్ఎస్ అధికారులను మంత్రి కేటీఆర్ అభినందించారు.
సీఎంఆర్ఎఫ్కు ఐఆర్ఎస్ అధికారుల విరాళం