తెలంగాణ

telangana

By

Published : Jun 3, 2020, 4:22 PM IST

ETV Bharat / state

మాస్కులు ధరించి పరీక్షలు రాసిన ఇంటర్ విద్యార్థులు

కూటక్​పల్లిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ రోజు ఇంటర్మీడియట్ జాగ్రఫీ పరీక్షను నిర్వహించారు. పరీక్షకు హాజరైన విద్యార్థులంతా మాస్కులు ధరించి భౌతిక దూరం పాటిస్తూ.. పరీక్ష రాశారు.

inter studednts wtite a exam wear masks
మాస్కులు ధరించి పరీక్షలు రాసిన ఇంటర్ విద్యార్థులు

లాక్​డౌన్ కారణంగా వాయిదాపడిన ఇంటర్మీడియట్ జాగ్రఫీ పరీక్షను ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే హైదరాబాద్ కూకట్​పల్లిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మొత్తం మూడు గదుల్లో 74 మంది విద్యార్థులకు పరీక్ష నిర్వహిస్తున్నారు.

పరీక్షా కేంద్రంలో విద్యార్థులు మాస్కులు ధరించి సామాజిక దూరం పాటిస్తున్నారు. విద్యార్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించే ముందు వారికి థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించారు. అనంతరం అందరికీ శానిటైజర్లు ఇస్తూ లోపలికి పంపించారు.

ఇవీ చూడండి:కేంద్ర విద్యుత్తు చట్టంపై కేసీఆర్ గుస్సా..

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details