ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ముచేయకుండా హిమాయత్నగర్ డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తానని భాజపా కార్పొరేటర్ మహాలక్ష్మి రామన్ గౌడ్ అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తనను గెలిపించిన ప్రజలకు ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు. డ్రైనేజీ, రహదారుల సమస్యలు, యువకులకు ఉపాధి కల్పన తన ముందున్న కర్తవ్యమని ఆమె వెల్లడించారు.
'హిమాయత్నగర్ డివిజన్ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా'
గ్రేటర్ ఎన్నికల్లో తనను గెలిపించిన ప్రతి ఒక్కరికి మహాలక్ష్మి రామన్ గౌడ్ ధన్యవాదాలు తెలిపారు. డివిజన్ ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటూ సమస్యలను పరిష్కరిస్తానని ఆమె అన్నారు.
'హిమాయత్నగర్ డివిజన్ ఆదర్శంగా తీర్చిదిద్దుతా'
గతంలో తెరాస కార్పొరేటర్ డివిజన్లో ఎలాంటి అభివృద్ధి పనులు చేయకుండా సమస్యలకు నిలయంగా మార్చారని మహాలక్ష్మి విమర్శించారు. ప్రజలు తనకు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని తెలిపారు. సమస్యలను పరిష్కరించి హిమాయత్నగర్ డివిజన్ను ఆదర్శంగా తీర్చిదిద్దుతానని పేర్కొన్నారు.