తెలంగాణ

telangana

పంజాగుట్ట హత్య కేసును ఛేదించిన పోలీసులు... ముగ్గురు అరెస్ట్

పంజాగుట్టలో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. ప్రధాన నిందుతులైన ముగ్గురిని చాంద్రాయణ​గుట్ట ప్రాంతంలో పట్టుకున్నారు. మరో ఇద్దరు నిందితుల కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.

By

Published : Oct 20, 2019, 7:17 PM IST

Published : Oct 20, 2019, 7:17 PM IST

Updated : Oct 20, 2019, 7:56 PM IST

HYDERABAD POLICE CHASED PANJAGUTTA MURDER CASE IN ONE DAY

హైదరాబాద్​ పంజాగుట్ట రియాసత్‌ అలీ హత్యకేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 5 కత్తులు, కారు, ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలిస్తున్నట్లు సీపీ అంజనీకుమార్​ తెలిపారు. రియాసత్​ అలీకి పాత కక్షలే కారణమని సీపీ వెల్లడించారు. గతంలో జరిగిన ఓ హత్య కేసులో నిందితుడైన రియాసత్ ఈ మధ్యే బెయిల్​పై విడుదలయ్యాడు. పథకం ప్రకారమే హత్య జరిగినట్లు సీపీ తెలిపారు. ఒక్క రోజులోనే కేసును ఛేదించిన సిబ్బందిని సీపీ అభినందించారు. నేరాల ఛేదనకు సాంకేతికత చాలా ఉపయోగపడిందని పేర్కొన్నారు.

పంజాగుట్ట హత్య కేసును ఛేదించిన పోలీసులు... ముగ్గురు అరెస్ట్
Last Updated : Oct 20, 2019, 7:56 PM IST

ABOUT THE AUTHOR

...view details