ఈనెల 17నుంచి మహా ఎల్ఆర్ఎస్ మేళా
ఈనెల 17 నుంచి నాలుగు రోజుల పాటు మహా ఎల్ఆర్ఎస్ మేళాను హెచ్ఎండీఏ నిర్వహించనుంది. గతంలో హెచ్ఎండీఏకు సమర్పించిన ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు మాత్రమే పరిశీలించనున్నారు.
హెచ్ఎండీఏ ఈనెల 17తేదీ నుంచి నాలుగు రోజులపాటు మహా ఎల్ఆర్ఎస్ మేళాను నిర్వహించనుంది. గతంలో హెచ్ఎండీఏకు సమర్పించిన ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు మాత్రమే పరిశీలించనున్నట్లు అధికారులు తెలిపారు. మేళాలో అన్నిరకాల మాన్యువల్ ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ స్వీకరించనున్నారు. సంబంధిత పత్రాలు, ఎన్ఓసీలు, డ్రాయింగ్లు, ధృవీకరణ పత్రాలు తీసుకురావాలని సూచించారు. ఫైల్ను డిజిటలైజ్, అప్డేట్ చేసి ప్రాసెస్ చేస్తామని పేర్కొన్నారు. ఎల్ఆర్ఎస్ ప్రొసీడింగ్లు పొందేందుకు ఈనెల 31వ తేదీ చివరి అవకాశమని అధికారులు వెల్లడించారు.