తెలంగాణ

telangana

By

Published : Aug 28, 2019, 9:45 PM IST

ETV Bharat / state

మున్సిపాలిటీ ఎన్నికల వివాదంపై విచారణ వాయిదా

మున్సిపాలిటీ ఎన్నికల వివాదంపై వ్యాజ్యాల విచారణను హైకోర్టు వాయిదా వేసింది. పిటిషనర్ అంజుకుమార్​రెడ్డి దాఖలు చేసిన కౌంటరుపై సమాధానం ఇచ్చేందుకు గడువు కావాలన్న ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు సెప్టెంబరు 9కి  వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది.

హైకోర్టు

మున్సిపాలిటీ ఎన్నికల వివాదంపై విచారణ వాయిదా

మున్సిపాలిటీ ఎన్నికల వివాదంపై దాఖలైన వ్యాజ్యాల విచారణను హైకోర్టు సెప్టెంబరు 9కి వాయిదా వేసింది. మున్సిపల్​ కమిషనర్లు... వార్డుల విభజనపై ఎంపీల అభిప్రాయాలను తీసుకున్నారన్న ప్రభుత్వ వాదన అబద్ధమంటూ పిటిషనర్​ అంజుకుమార్​ రెడ్డి ఉన్నత న్యాయస్థానంలో మంగళవారం రిప్లై కౌంటరు దాఖలు చేశారు. తమ అభిప్రాయాలు తీసుకోలేదని ఎంపీలు రేవంత్​రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, బండి సంజయ్​ అఫిడవిట్లు సమర్పించారు. అయితే దీనిపై వాదనలు వినిపించేందుకు గడువు కావాలని ధర్మాసనాన్ని ప్రభుత్వం కోరింది. స్పందించిన ఉన్నత న్యాయస్థానం... ఈ వ్యవహారంలో దాఖలైన అన్ని వ్యాజ్యాలపై విచారణ వాయిదా వేసింది.

ABOUT THE AUTHOR

...view details