తెలంగాణ

telangana

ఏపీ, తెలంగాణ సరిహద్దుల్లో తనిఖీలు... భారీగా నిలిచిన వాహనాలు

By

Published : Jun 1, 2020, 12:33 PM IST

ఏపీలోని కృష్ణా జిల్లా గరికపాడు చెక్​పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. తెలంగాణ నుంచి ఏపీకి వస్తోన్న వాహనాలను పోలీసులు అడ్డుకుంటున్నారు. పాసులు ఉన్నవారికి మాత్రమే అనుమతినివ్వడం వల్ల... చెక్‌పోస్ట్ వద్ద అర కిలోమీటరు వరకు వాహనాలు బారులు తీరాయి.

heavy-traffic-at-garikapadu-check-post-in-krishna-district
గరికపాడు చెక్‌పోస్ట్ వద్ద తనిఖీలు... బారులు తీరిన వాహనాలు

ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా గరికపాడు చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. తెలంగాణ నుంచి ఏపీకి వెళ్తున్న వాహనాలను పోలీసులు అడ్డుకుంటున్నారు. పాస్‌లు ఉన్నవారిని మాత్రమే అనుమతిస్తూ... వారికి చేతిపై హోం క్వారంటైన్‌ ముద్ర వేస్తున్నారు. 14 రోజులపాటు హోం క్వారంటైన్‌లో ఉండాలని వాహనాదారులకు సూచిస్తున్నారు. పాసులు ఉన్నవారికి మాత్రమే అనుమతిస్తున్నందున చెక్‌పోస్ట్ వద్ద అర కిలోమీటరు వరకు వాహనాలు నిలిచిపోయాయి.

ABOUT THE AUTHOR

...view details