శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతోంది. 2 లక్షల 62 వేల 64 క్యూసెక్కుల నీరు చేరుతోంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులకు... ప్రస్తుతం 866.10 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 215.81 టీఎంసీలు కాగా... ప్రస్తుతం 126.66 టీఎంసీల నీరు ప్రాజెక్టులో నిల్వ ఉంది.
మరోవైపు.. వరద గోదారి శాంతించింది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం వద్ద గోదావరిలో వరద నెమ్మదిగా తగ్గుతోంది. ధవళేశ్వరం కాటన్ ఆనకట్ట వద్ద వరద మరింత తగ్గింది. మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద ప్రస్తుత నీటిమట్టం 12.1 అడుగులు ఉండగా... సముద్రంలోకి 12.51 లక్షల క్యూసెక్కులు వదులుతున్నారు. తూర్పు గోదావరి డెల్టా కాల్వలకు 10,800 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. అటు తెలంగాణలోని భద్రాచలం వద్ద గోదావరి వరద నెమ్మదిగా తగ్గుతోంది. ప్రస్తుత నీటిమట్టం 42.7 అడుగులుగా ఉంది. అక్కడ మొదటి ప్రమాద హెచ్చరిక ఉపసంహరించారు.