తెలంగాణ

telangana

By

Published : Oct 31, 2020, 5:15 PM IST

ETV Bharat / state

ఆర్థిక సహాయం కోసం వరద బాధితుల ఆందోళన

ఇటీవల కురిసిన వర్షాలకు నష్టపోయిన వారికి అందించే ఆర్థిక సహాయం.. తమకు అందడం లేదని వరద బాధితులు ఆందోళనకు దిగారు. హైదరాబాద్​లోని పలు కాలనీల్లో ధర్నా నిర్వహించారు. వీరికి భాజపా నాయకులు మద్దతిచ్చారు.

flood victims protest for financial help in hyderabad
ఆర్థిక సహాయం కోసం వరద బాధితుల ఆందోళన

హైదరాబాద్​లో వరద సహాయం అందక బాధితులు ఆందోళనకు దిగుతున్నారు. గడ్డిఅన్నారం, చైతన్యపురి డివిజన్లలోని కోదండరామ్​నగర్, సీసాలబస్తీ, వివేకానందనగర్ కాలనీ, హనుమాన్​నగర్, సాయినగర్, శారదానగర్ కాలనీ, ద్వారకపురం, విద్యుత్​నగర్, వికాస్​నగర్​లో ధర్నా నిర్వహించారు. వీరికి భాజపా నాయకులు మద్దతిచ్చారు.

కేసీఆర్​, కేటీఆర్​, ఎమ్మెల్యే, కార్పొరేటర్లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రూ.10 వేల ఆర్థిక సాయాన్ని బాధితులకు కాకుండా ఇతరులకు ఇస్తున్నారని వారు ఆరోపించారు. నష్టపోయిన వారందరికీ పరిహారాన్ని అందించాలని డిమాండ్​ చేశారు. కేసీఆర్ పెద్ద మనసుతో సాయం అందిస్తే.. స్థానిక నాయకులు మాత్రం పెద్ద ఎత్తున సొమ్ము చేసుకున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు.

ఇదీ చదవండి:వరద సాయం కోసం నగరంలో పలుచోట్ల బాధితుల ఆందోళన

ABOUT THE AUTHOR

...view details