తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎమ్మెల్యే క్వార్టర్స్​లో పేకాట రాయుళ్ల అరెస్ట్

హైదరాబాద్​ బషీర్​బాగ్​ న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్​లోని మాజీమంత్రి ముఖేష్​ గౌడ్​కు కేటాయించిన క్వార్టర్స్​లో పేకాట ఆడుతున్న ఎనిమిది మందిని సైఫాబాద్​ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి రూ. లక్షా 21 వేల నగదు, 8 చరవాణులు, ఖాళీ మద్యం బాటిళ్లు, సిగరెట్​ ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు.

By

Published : Jun 19, 2020, 1:14 PM IST

eight arrested while playing cards at mla quarters hyderabad
ఎమ్మెల్యే క్వార్టర్స్​లో పేకాట రాయుళ్ల అరెస్ట్

హైదరాబాద్​ న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్​లోని దివంగత నేత మాజీ మంత్రి ముఖేష్​ గౌడ్​కు కేటాయించిన క్వార్టర్స్​లో పేకాట ఆడుతున్న ఎనిమిది మందిని సైఫాబాద్​ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బషీర్​బాగ్​ న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్​లోని 129 క్వార్టర్​లో పేకాట ఆడుతున్నట్లు సమాచారమందగా.. గురువారం రాత్రి పోలీసులు దాడులు నిర్వహించారు.

క్వార్ట్​ర్స్​లో పేకాట ఆడుతున్న కిరణ్​కుమార్, సతీష్​కుమార్, ప్రదీప్, మోహన్​రావు, మురళి,మన్మోహన్, రాజ్​కుమార్​, గోపాల్​రావులను అదుపులోకి తీసుకున్నారు. వీరిపై గేమింగ్​ యాక్టు కింద కేసు నమోదు చేసి పోలీసులు రిమాండ్​కు తరలించారు. వీరి నుంచి రూ. లక్షా 21 వేల నగదు, 8 చరవాణులు, ఖాళీ మద్యం బాటిళ్లు, సిగరెట్​ ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు.

ఇదీచూడండి:సీనియర్​ ఐఏఎస్​ అధికారి బీపీ విఠల్ కన్నుమూత

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details