తెలంగాణ

telangana

దేశంలో వైద్యులకు రక్షణ కల్పించాలి

దేశంలో వైద్యులపై జరుగుతున్న దాడులను వెంటనే అరికట్టాలని ఉషాలక్ష్మీ బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ డైరెక్టర్ డాక్టర్ పి.రఘురామ్ ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు. కోల్​కతలో వైద్యులపై దాడికి తెగబడిన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు.

By

Published : Jun 16, 2019, 10:18 PM IST

Published : Jun 16, 2019, 10:18 PM IST

దేశంలో వైద్యులకు రక్షణ కల్పించాలి

కోల్​కతాలోని ఎన్​ఆర్​ఎస్ మెడికల్ కళాశాలలో ఇటీవల వైద్యులపై జరిగిన దాడి విషయంలో ఉషాలక్ష్మీ బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ డైరెక్టర్ డాక్టర్ పి.రఘురామ్ ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు. వైద్యులపై జరుగుతున్న దాడులకు సంబంధించి తక్షణం చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు. కోల్​కతాలో వైద్యులపై దాడికి తెగబడిన వారిని కఠినంగా శిక్షించాలని, అదేవిధంగా ఇండియన్ పీనల్ కోడ్​లోని సెక్షన్ 332, 333 అమలు చేయాలన్నారు. వైద్యులపై దాడి చేసిన వారిని 3 నుంచి 7ఏళ్లు శిక్షించాలని తెలిపారు. ఇక వీటితోపాటు ప్రభుత్వ ఆస్పత్రుల్లో తక్షణం భద్రతను పెంచాలని ఆయన తన లేఖలో ప్రధానిని కోరారు.

ABOUT THE AUTHOR

...view details