దేశం కోసం అమరుడైన కర్నల్ సంతోష్బాబు కుటుంబానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉదారమైన సాయం ప్రకటించారని, అది ఇప్పటివరకు సైనికులకు ఎవరూ చేయనంత గొప్పగా ఉందని నావికాదళం డిప్యూటీ చీఫ్ వైస్ అడ్మిరల్ ఎంఎస్ పవార్ హర్షం వ్యక్తంచేశారు. ఈ మేరకు కృతజ్ఞతలు తెలియజేస్తూ శుక్రవారం కేసీఆర్కు లేఖ రాశారు.
‘‘సీఎం కేసీఆర్ బాట ఇతర రాష్ట్రాల సీఎంలు అనుసరించేలా ఉంది. మాతృభూమిని రక్షించడానికి భారత సైనికులు ఎన్నడూ వెరవలేదు. అమరులైన ఎందరో సైనికుల పేర్లను జాతి గుర్తు పెట్టుకుంది. మీ చర్య ప్రతీ ఒక్కరినీ కదిలించేలా, స్ఫూర్తి నింపేలా చేసింది. దేశం కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధపడేలా ఆలోచింపజేసింది. దేశం కోసం మేం అమరులమైతే మా కుటుంబాలకు జాతి యావత్తు అండగా ఉంటుందనే నమ్మకమైన సందేశాన్నిచ్చింది. సంతోష్తో పాటు అమరులైన మరో 19 మంది సైనికులకు సాయం ప్రకటించడం గొప్ప విషయం’’ అని పేర్కొన్నారు.