తెలంగాణ

telangana

By

Published : May 22, 2021, 9:58 AM IST

ETV Bharat / state

లాక్​డౌన్​ నిబంధనలు మరింత కఠినతరం: అంజనీకుమార్​

ఉదయం 10 గంటల తర్వాత అత్యవసర వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుందని హైదరాబాద్​ సీపీ అంజనీకుమార్​ పేర్కొన్నారు. నేటి నుంచి నిబంధనలను మరింత కఠినతరం చేయనున్నామని స్పష్టం చేశారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చేవారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.

సీపీ అంజనీ కుమార్
సీపీ అంజనీ కుమార్

నేటి నుంచి లాక్‌డౌన్​ను మరింత కఠినతరం చేయనున్నామని హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ పేర్కొన్నారు. ఉదయం 10 గంటల తర్వాత కేవలం మెడికల్, ముఖ్యమైన వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్​ చేశారు.

లాక్​డౌన్​ సమయంలో అనవసరంగా రోడ్లపైకి వచ్చిన వారిపై కఠిన చర్యలు తప్పవని సీపీ హెచ్చరించారు. అలాంటి వారిపై కేసులతో పాటు వాహనాలను జప్తు చేస్తామని తెలిపారు. కొంతమంది బాధ్యతారాహిత్యం వల్ల అందరినీ ప్రమాదంలోకి నెట్టలేమంటూ సీపీ ట్వీట్​ చేశారు.

ఇదీ చూడండి: లాక్​డౌన్ ఉల్లంఘనపై పోలీసుల ఉక్కుపాదం

ABOUT THE AUTHOR

...view details