తెలంగాణ

telangana

ETV Bharat / state

పేర్వారం రాములుకు కోర్టు వారంట్​

పరువునష్టం కేసులో హైదరాబాద్​ మాజీ పోలీస్​ కమిషనర్​ పేర్వారం రాములుకు సిటీ సివిల్​ కోర్టు వారంట్​ జారీ చేసింది. పేర్వారం రాములు సీపీగా ఉన్న సమయంలో ఎం. మాధవ రెడ్డిని పీడీ చట్టం కింద అరెస్ట్​ చేసినందుకు మాధవరెడ్డి పరువు నష్టం కేసు వేశారు.

By

Published : Jun 25, 2019, 11:32 PM IST

పేర్వారం రాములు

హైదరాబాద్​ మాజీ పోలీస్​ కమిషనర్​ పేర్వారం రాములుకు సిటీ సివిల్​ కోర్టు వారంట్​ జారీ చేసింది. పేర్వారం రాములు 2001లో హైదరాబాద్​ సీపీగా ఉన్న సమయంలో భూ కబ్జా ఆరోపణలపై అప్పటి సీఐ ఎం.మాధవరెడ్డిని పీడీ చట్టం కింద అరెస్ట్​ చేశారు. ఈ విషయమై మాధవరెడ్డి సిటీ సివిల్​ కోర్టులో రాములుతో పాటు పలువురిపై పరువునష్టం కేసు వేశారు. విచారణ జరిపిన కోర్టు మాధవరెడ్డికి రూ.75 లక్షలను 7 శాతం వడ్డీతో చెల్లించాలని 2017లో రాములును ఆదేశించింది. ఒకవేళ ఆయన చెల్లించకపోతే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ కార్యదర్శి చెల్లించి.... పేర్వారం రాములు నుంచి రికవరీ చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. గత ఏప్రిల్​ నెలలో వారంట్​ జారీ చేసిన కోర్టు రేపు విచారణ చేపట్టనుంది.

ABOUT THE AUTHOR

...view details