తెలంగాణ

telangana

ముఖ్యమంత్రికి చినజీయర్​ స్వామి ఉపదేశించాలి: వీహెచ్​

By

Published : Nov 20, 2019, 8:48 PM IST

చినజీయర్​ స్వామి మాటను ముఖ్యమంత్రి కేసీఆర్​ జవదాటరని కాంగ్రెస్​ సీనియర్​ నేత వీహెచ్​ అన్నారు.  ఆర్టీసీకి న్యాయం చేయాలని కేసీఆర్​కు స్వామి చెప్పాలని విజ్ఞప్తి చేశారు.

ముఖ్యమంత్రికి చినజీయర్​ స్వామి ఉపదేశించాలి: వీహెచ్​

ఆర్టీసీ కార్మికులకు న్యాయం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చెప్పాలని చినజీయర్‌ స్వామికి కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హనుమంతురావు విజ్ఞప్తి చేశారు. చినజీయర్‌ స్వామి మాట సీఎం కేసీఆర్‌ జవదాటరన్న వీహెచ్​... యాభై వేల మంది ఆర్టీసీ కార్మికులకు చెందిన సమస్య పరిష్కారం చేసేలా కృషి చేయాలని సూచించారు.

గంగా జల్ సినిమాలో అరాచకాలకు వ్యతిరేకంగా ప్రజలు యాసిడ్ పట్టుకొని తిరిగినట్లే.... రాష్ట్రంలో కూడా రెవెన్యూ ఇబ్బందులతో ప్రజలు పెట్రోల్ పట్టుకుని తిరుగుతున్నారని అన్నారు. రాష్ట్రంలో 24 మంది ఆర్టీసీ కార్మికులు వివిధ కారణాలతో చనిపోతే చినజీయర్‌ స్వామి స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ముఖ్యమంత్రికి చినజీయర్​ స్వామి ఉపదేశించాలి: వీహెచ్​

ఇవీ చూడండి: 'బేషరతుగా ఆహ్వానిస్తే విధులకు హాజరయ్యేందుకు సిద్ధం'

ABOUT THE AUTHOR

...view details