రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డిపై దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షుడు వడ్లమూరి క్రిష్ణస్వరూప్.. హైదరాబాద్ నాంపల్లి పీఎస్లో ఫిర్యాదు చేశారు. మాసబ్ ట్యాంక్ ఏసీ గార్డ్స్ ఎన్నికల కమిషన్ కార్యాలయంలో మున్సిపల్ ఎన్నికలపై నిర్వహించిన ఆల్ పార్టీ మీటింగ్లో.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళల రిజర్వేషన్లు ఖరారు చేయకుండా షెడ్యూలు ఎలా ఇచ్చారని అడిగినట్లు తెలిపారు. సమాధానం చెప్పాల్సిన నాగిరెడ్డి... త్రీవ పదజాలంతో దూషించడమే కాకుండా... తన సిబ్బందితో దాడి చేయించారని క్రిష్ణస్వరూప్ ఆరోపించారు.
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డిపై పీఎస్లో ఫిర్యాదు
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డిపై దళిత బహుజన పార్టీ అధ్యక్షుడు క్రిష్ణస్వరూప్... నాంపల్లి పీఎస్లో ఫిర్యాదు చేశారు. నాగిరెడ్డి తనను తీవ్రపదజాలంతో దూషించడమే కాకుండా.. తనపై సిబ్బందితో దాడి చేయించారని ఆరోపించారు.
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డిపై పీఎస్లో ఫిర్యాదు
ఎన్నికల అధికారి నాగిరెడ్డి, సిబ్బందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని నాంపల్లి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. విచారణ జరిపిన అనంతరం చర్యలు తీసుకుంటామని పోలీసులు అధికారులు హామీ ఇచ్చారని ఆయన పేర్కొన్నారు.
ఇవీ చూడండి:'తెరాస, ఎంఐఎంలు మోదీ కోసం పనిచేస్తున్నాయి'
Last Updated : Dec 29, 2019, 7:06 AM IST