పేద కుటుంబాలను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతగానో తోడ్పడుతుందని ఉప సభాపతి పద్మారావు గౌడ్ తెలిపారు. సికింద్రాబాద్ నియోజకవర్గం, అడ్డగుట్ట డివిజన్లోని శాంతినగర్లో నివాసం ఉంటున్న ఒకే కుటుంబానికి చెందిన అబ్దుల్ హన్నన్, అబ్దుల్ మన్నన్ అనే ఇద్దరు అన్నదమ్ములకి ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు.
పేదల వైద్య సేవలకు అధిక ప్రాముఖ్యత: ఉప సభాపతి
పేద ప్రజల వైద్య సేవలకు తమ ప్రభుత్వం అధిక ప్రాముఖ్యతనిస్తుందని ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి సహానిధి కింద మంజూరైన చెక్కులను సికింద్రాబాద్ నియోజకవర్గంలోని లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
![పేదల వైద్య సేవలకు అధిక ప్రాముఖ్యత: ఉప సభాపతి cm relief fund Cheques Distribution to the poor by Deputy Speaker at secunderabad in hyderabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8337909-518-8337909-1596851734854.jpg)
పేదల వైద్య సేవలకు తాము అధిక ప్రాముఖ్యత: ఉప సభాపతి
ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స కోసం విడుదలైన రూ. 2 లక్షల నిధుల మంజూరు పత్రాలను డిప్యూటీ స్పీకర్ శుక్రవారం టకార బస్తీలోని తన క్యాంపు కార్యాలయంలో అందించారు. పేదల వైద్య సేవలకు తాము అధిక ప్రాముఖ్యతను కల్పిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
ఇవీచూడండి:భారత్ బయోటెక్ ల్యాబ్ను సందర్శించిన మంత్రి కేటీఆర్
TAGGED:
latest news of secunderabad