తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎసారెస్పీ వరద కాల్వలకు కాళేశ్వరం జలాలు.. కేసీఆర్ ఆదేశాలు

రైతన్నల కోరిక మేరకు వానాకాలంలో ఎస్సారెస్పీ వరదకాల్వలకు కాళేశ్వరం జలాలు వదలాలని సీఎం కేసీఆర్​ కాళేశ్వరం ఇంజినీర్ ఇన్ చీఫ్ వెంకటేశ్వర్లుకు ఆదేశాలు జారీ చేశారు. వరదకాల్వలోని సాగునీటి ద్వారా ఆయకట్టు రైతులకు లబ్ధి జరుగుతుందని మంత్రి ప్రశాంత్ రెడ్డి సీఎంకు విజ్ఞప్తి చేశారు. స్పందించిన సీఎం కేసీఆర్​కు మంత్రి ధన్యవాదాలు తెలిపారు.

By

Published : Jul 2, 2020, 8:41 PM IST

CM KCR responded to the minister prashanth reddy request
మంత్రి విజ్ఞప్తికి స్పందించిన సీఎం కేసీఆర్

రైతుల కోరిక మేరకు వానాకాలం దృష్ట్యా ఎస్సారెస్పీ వరదకాల్వను కాళేశ్వరం జలాలు వదలాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. రహదారులు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి విజ్ఞప్తి మేరకు కాళేశ్వరం ఇంజినీర్ ఇన్ చీఫ్ వెంకటేశ్వర్లుకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. వరదకాల్వలోని సాగునీటి ద్వారా ఆయకట్టు రైతులకు పెద్దఎత్తున లబ్ధి జరుగుతుందని ప్రశాంత్ రెడ్డి సీఎంకు విజ్ఞప్తి చేశారు.

ఆదేశాల నేపథ్యంలో

సీఎం కేసీఆర్​కు కృతజ్ఞతలు తెలిపిన మంత్రి ప్రశాంత్ రెడ్డి.. రైతుగా సాగునీటి కష్టాలు, అవసరాలు తెలిసినందునే వెంటనే సహృదయంతో స్పందించారని అన్నారు. రైతు కష్టాలు తన కష్టంగా తల్లడిల్లే వ్యక్తి సీఎంగా ఉండటం రైతాంగం అదృష్టమని ప్రశాంత్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల నేపథ్యంలో ఎస్సారెస్పీ వరద కాలువ కింద ఉన్న ఆయకట్టు రైతులు అప్రమత్తం కావాలన్నారు. సాగునీటిని సద్వినియోగం చేసుకోవాలని రైతులను కోరారు. ఆయకట్టు రైతాంగం పక్షాన సీఎం కేసీఆర్​కు మంత్రి వేముల ధన్యవాదాలు తెలిపారు.

ఇదీ చూడండి :ఎన్​పీసీఐ డేటా కేంద్రానికి శంకుస్థాపన చేసిన మంత్రి కేటీఆర్

ABOUT THE AUTHOR

...view details