తెలంగాణ

telangana

తెరాస తీర్థం పుచ్చుకోనున్న మండవ వెంకటేశ్వరరావు

By

Published : Apr 5, 2019, 3:12 PM IST

Updated : Apr 5, 2019, 7:44 PM IST

తెదేపా సీనియర్ నేత మండవ వెంకటేశ్వరరావు కారెక్కాలని నిర్ణయించుకున్నారు. దాదాపు 2 గంటల పాటు మండవ నివాసంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనతో భేటీ అయ్యారు.

తెరాస తీర్థం పుచ్చుకోనున్న మండవ వెంకటేశ్వరరావు

తెదేపా సీనియర్ నేత మండవ వెంకటేశ్వరరావు తెరాస తీర్థం పుచ్చుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ రోజు మధ్యాహ్నం హైదరాబాద్​ జూబ్లీహిల్స్‌లోని మండవ వెంకటేశ్వరరావు నివాసంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనతో సమావేశమయ్యారు. దాదాపు 2 గంటలపాటు సాగిన ఈ భేటీలో పార్లమెంట్ ఎన్నికలు, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. ఇవాళ పాస్​పోర్టు కార్యాలయంకు వెళ్లిన కేసీఆర్​.. అక్కడి నుంచి మండవ ఇంటికి వెళ్లారు. ఈరోజు ఉదయమే మండవతో ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, పువ్వాడ అజయ్ కుమార్ సమావేశమయ్యారు.

తెరాస తీర్థం పుచ్చుకోనున్న మండవ వెంకటేశ్వరరావు
Last Updated : Apr 5, 2019, 7:44 PM IST

ABOUT THE AUTHOR

...view details