తెలంగాణ

telangana

By

Published : Mar 17, 2021, 12:56 PM IST

Updated : Mar 17, 2021, 1:07 PM IST

ETV Bharat / state

సాగు చట్టాలకు వ్యతిరేకంగా సభలో తీర్మానం చేయాలి: భట్టి

సాగు చట్టాలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కోరారు. రైతు ఆందోళనలపై సభలో చర్చిద్దామని తెలిపారు.

సాగు చట్టాలకు వ్యతిరేకంగా సభలో తీర్మానం చేయాలి: భట్టి
సాగు చట్టాలకు వ్యతిరేకంగా సభలో తీర్మానం చేయాలి: భట్టి

కేంద్ర ప్రభుత్వ చట్టాలపై గతంలో సభలో చర్చించామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క శాససనభ సమావేశాల్లో పేర్కొన్నారు. రైతుల ఆందోళనలపై సభలో చర్చించి... కేంద్ర ప్రభుత్వ చట్టాలపై తీర్మానం కూడా చేయాలని ప్రతిపాదించారు.

రాష్ట్రంలో పండించిన పంటలను ఐకేపీ సెంటర్ల ద్వారా కొనుగోలు చేశారని తెలిపారు. ఇప్పుడు ఆ సెంటర్లు ఎత్తివేసిన పక్షంలో అవసరమైతే కేంద్రంతో యుద్ధం చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారని సభలో గుర్తు చేశారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా సభలో తీర్మానం చేయాలని సూచించారు. పంజాబ్, కేరళ అసెంబ్లీల్లో కూడా తీర్మానాలు చేశారని ఈ సందర్భంగా తెలిపారు. సభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని సీఎంను కోరుతున్నట్లు చెప్పారు. భాజపాయేతర రాష్ట్రాల్లో ఎలా తీర్మానం చేశారో అధ్యయనం చేయాలని సూచించారు. రాష్ట్రంలో కొనుగోలు కేంద్రాలను కొనసాగించాలని భట్టి కోరారు.

సాగు చట్టాలకు వ్యతిరేకంగా సభలో తీర్మానం చేయాలి: భట్టి
Last Updated : Mar 17, 2021, 1:07 PM IST

ABOUT THE AUTHOR

...view details