తెలంగాణ

telangana

By

Published : Mar 9, 2021, 3:42 PM IST

ETV Bharat / state

'ధాన్యం సేకరణ కేంద్రాలు మూసేస్తామని తెలంగాణ చెప్పలేదు'

తెలంగాణలో ధాన్యం సేకరణ కేంద్రాలపై పీసీసీ అధ్యక్షుడు, నల్గొండ ఎంపీ ఉత్తమ్​ కుమార్​ రెడ్డి లోక్​సభలో లేవనెత్తారు. ధాన్యం కేంద్రాలు మూసివేస్తున్నట్లు రాష్ట్రం ప్రకటన చేసిందన్నారు. దీనిపై స్పందించిన కేంద్రం.. ధాన్యం సేకరణ కేంద్రాలు మూసివేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్రం చెప్పలేదని తెలిపింది.

central gave answer on  grain purchasing centers  in telangana
'ధాన్యం సేకరణ కేంద్రాలు మూసేస్తామని తెలంగాణ చెప్పలేదు'

రాష్ట్రంలో ధాన్యం సేకరణ కేంద్రాలపై లోక్‌సభలో కేంద్రం సమాధానం చెప్పింది. తెలంగాణలో ధాన్యం సేకరణ కేంద్రాలపై పీసీసీ అధ్యక్షుడు, నల్గొండ ఎంపీ ఉత్తమ్​ కుమార్​ రెడ్డి లోక్​సభలో లేవనెత్తారు. ధాన్యం కేంద్రాలు మూసివేస్తున్నట్లు రాష్ట్రం ప్రకటన చేసిందన్నారు.

రాష్ట్ర ప్రభుత్వ ప్రకటన కేంద్రం దృష్టికి వచ్చిందా అని అడిగారు. సాగుచట్టాల అమలులో భాగంగా నిర్ణయం తీసుకున్నారా? అని ప్రశ్నించారు. ఎంపీ ఉత్తమ్ అడిగిన ప్రశ్నకు కేంద్రం లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది. ధాన్యం సేకరణ కేంద్రాలు మూసివేస్తున్నట్లు తెలంగాణ చెప్పలేదని తెలిపింది.

ఇదీ చదవండి:ఎన్నికల్లో ఎవరూ తప్పుడు ఓట్లు వేయొద్దు : కోదండరాం

ABOUT THE AUTHOR

...view details