తెలంగాణ

telangana

By

Published : Feb 1, 2019, 6:53 PM IST

Updated : Feb 1, 2019, 7:59 PM IST

ETV Bharat / state

బడ్జెట్ హైలైట్స్​

కేంద్ర మంత్రి పీయూష్​ గోయల్​ ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్​లోని ముఖ్య అంశాలు........

బడ్జెట్ హైలైట్స్​

2019-20 సంవత్సరానికి తాత్కాలిక బడ్జెట్‌ను కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ లోక్‌సభలో ప్రవేశ పెట్టారు. ముఖ్యంగా రైతులు, ఉద్యోగులు, మధ్య తరగతి ప్రజలను ఆకట్టుకునేలా రూపొందించారు. బడ్జెట్‌లోని ముఖ్యాంశాలను ఒకసారి చూద్దాం.

  • రైతుల కోసం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి. 5 ఎకరాల లోపు రైతులకు ఏటా రూ.6 వేల ఆర్థిక సాయం
  • అసంఘటిత కార్మికుల కోసం ప్రధాన మంత్రి శ్రమయోగి మాన్​ధన్. 60 ఏళ్లు నిండినవారికి నెలకు రూ.3 వేల పింఛన్
  • ఆదాయపు పన్ను పరిమితి రూ.5 లక్షలకు పెంపు. స్టాండర్డు డిడక్షన్ పరిమితి రూ.40వేల నుంచి 50 వేలకు పెంపు
  • ఇళ్ల కొనుగోలుదారులపై జీఎస్టీ భారం తగ్గించేందుకు చర్యలు
  • ఐటీ రిటర్నుల దాఖలు 24 గంటల్లో పూర్తి చేసేందుకు చర్యలు
  • మహాత్మగాంధీ గ్రామీణ ఉపాధి పథకానికి రూ. 60 వేల కోట్ల కేటాయింపు
  • అందరికీ ఆహారం కోసం రూ.1.7 లక్షల కోట్లు కేటాయింపు
  • ఆవుల సంరక్షణకు జాతీయ కామధేను పథకం. జాతీయ గోకుల్ మిషన్​కు 750 కోట్ల కేటాయింపు
  • పాడి, ఆక్వా రైతులకు వడ్డీ రాయితీలు ప్రకటన
  • రక్షణ రంగానికి రూ. 3 లక్షల కోట్ల కేటాయింపు
  • వచ్చే ఐదు సంవత్సరాల్లో లక్ష డిజిటల్ గ్రామాల ఏర్పాటు
  • హరియాణాలో 22వ ఎయిమ్స్ ఏర్పాటు
  • 21 వేల వేతనం వచ్చే వారికి కూడా ఈఎస్ఐ అమలు
Last Updated : Feb 1, 2019, 7:59 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details