తెలంగాణ

telangana

By

Published : Feb 19, 2020, 9:07 AM IST

ETV Bharat / state

నేటితో ముగియనున్న బయో ఏషియా సదస్సు

హైదరాబాద్​లో జరుగుతున్న బయో ఏషియా సదస్సు నేటితో ముగియనుంది. ఔషధ, జీవశాస్త్ర రంగాలపై రెండు రోజులుగా చర్చించగా.. ఇవాళ స్టార్టప్ అవార్డుల ప్రదానంతో సదస్సు ముగియనుంది.

Bio_Asia_Conference will be over today in hyderabad
నేటితో ముగియనున్న బయో ఏషియా సదస్సు

హైదరాబాద్ హెచ్​ఐసీసీ వేదికగా జరుగుతున్న బయో ఏషియా సదస్సు నేటితో ముగియనుంది. జీవశాస్త్ర రంగంలో మార్పులు, సాంకేతికత ఉపయోగాలు, పెట్టుబడులపై రెండు రోజులుగా ప్రముఖులు... అభిప్రాయాలు పంచుకుంటున్నారు. ఇందుకోసం వరుస ప్యానెల్ చర్చలు, అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారు.

చివరి రోజు ప్యానెల్ డిస్కషన్స్, స్పాట్ లైట్ సెషన్స్ కొనసాగనున్నాయి. సాయంత్రం జరిగే ముగింపు కార్యక్రమంలో మంత్రి కేటీఆర్, ఒడిశా మంత్రి అశోక్ చంద్రా పాల్గొననున్నారు. మొదటి రెండు రోజుల్లో జీనోం వాలీ ఎక్సలెన్సీ అవార్డులను ప్రదానం చేసిన సదస్సు.. ఇవాళ స్టార్టప్‌ అవార్డులతో సదస్సును ముగించనుంది.

నేటితో ముగియనున్న బయో ఏషియా సదస్సు

ఇదీ చదవండిఃవరుస రోడ్డు ప్రమాదాలు.. నిర్లక్ష్యమే కారణమా?

ABOUT THE AUTHOR

...view details