తెలంగాణ

telangana

'విజయారెడ్డి హత్యపై సీబీఐ విచారణ జరిపించాలి '

ఒక ప్రభుత్వ అధికారిని తన కార్యాలయంలోనే కాల్చి చంపిన ఘటన దేశంలో ఎక్కడా జరగలేదన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. తహసీల్దార్​ విజయారెడ్డి హత్యను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు.

By

Published : Nov 6, 2019, 6:22 PM IST

Published : Nov 6, 2019, 6:22 PM IST

Updated : Nov 6, 2019, 6:43 PM IST

భట్టి విక్రమార్క

రాష్ట్రంలో భూ రికార్డుల ప్రక్షాళన విపరీత పరిస్థితులకు దారితీస్తోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆక్షేపించారు. పార్ట్​​-బీలో పెట్టిన భూముల సమస్యలు పరిష్కరించకుండా కాలయాపన చేస్తున్నారని దుయ్యబట్టారు. ఒక ప్రభుత్వ అధికారిని తన కార్యాలయంలోనే కాల్చి చంపిన ఘటన దేశంలో ఎక్కడా జరగలేదన్నారు. సీఎం కేసీఆర్​ తీసుకున్న నిర్ణయాలే దీనికి కారణమని ఆరోపించారు. తహసీల్దార్ విజయారెడ్డి హత్యను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. ఈ ఘటనపై సిట్టింగ్ జడ్జి లేదా సీబీఐతో విచారణ జరిపించాలని భట్టి విక్రమార్క డిమాండ్​ చేశారు.

'విజయారెడ్డి హత్యపై సీబీఐతో విచారణ జరిపించాలి'
Last Updated : Nov 6, 2019, 6:43 PM IST

ABOUT THE AUTHOR

...view details