తెలంగాణ

telangana

"చర్చలకు ఎప్పుడు పిలిచినా మేము సిద్ధం"

ఆర్టీసీ కార్మిక సంఘాలతో జరిగిన చర్చల్లో తాము మధ్యలో వెళ్లిపోలేదని.. ప్రజలకు ఐఏఎస్ అధికారులు అవాస్తవాలు చెప్పారని ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వత్థామరెడ్డి తెలిపారు.

By

Published : Oct 27, 2019, 12:25 PM IST

Published : Oct 27, 2019, 12:25 PM IST

ఐఏఎస్‌ అధికారులు అబద్ధాలు చెప్పవద్దు: అశ్వత్థామరెడ్డి

కార్మికసంఘాలతో చర్చలపై ఆర్టీసీ యాజమాన్యం అవాస్తవాలు ప్రచారం చేస్తోందని ఐకాస కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి ఆరోపించారు. తెలంగాణ మజ్దూర్‌ యునియన్‌ ఆవిర్భావించి ఎనిమిదేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా హైదరాబాద్‌లోని యూనియన్‌ కార్యాలయంలో ఆయన జెండా ఆవిష్కరించారు. చర్చల నుంచి తాము వెళ్లిపోలేదని... ఐఏఎస్​లే బాయ్‌కాట్‌ చేశారని వివరించారు. ఎప్పుడు చర్చలకు పిలిచినా తాము సిద్ధంగా ఉన్నామని అశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు.

ఐఏఎస్‌ అధికారులు అబద్ధాలు చెప్పవద్దు: అశ్వత్థామరెడ్డి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details