ఘనంగా అన్నమయ్య 611 జయంత్యుత్సవాలు
అన్నమయ్య 611వ జయంత్యుత్సవాలకు హైదరాబాద్ రవీంద్రభారతి వేదికైంది. ఘంటసాల కళా వేదికపై సుమారు వేయి మంది సంగీత కళాకారులు, చిన్నారులు అన్నమయ్య కీర్తనలు అలపించారు. అన్నమయ్య కీర్తనల్లోని మాధుర్యాన్ని పెద్దలు వివరించారు. సంకీర్తనల్లో ఉన్న సారాన్ని మనసుకు ఆకళింపుచేసుకోవాలని కోరారు.