తెలంగాణ

telangana

ETV Bharat / state

సచివాలయ ముట్టడికి బయల్దేరిన అఖిలపక్ష నేతల అరెస్టు

అఖిలపక్షం ఆధ్వర్యంలో సచివాలయ ముట్టడికి బయలుదేరిన నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఇందిరాపార్క్‌ వద్ద నాయకులను అదుపులోకి తీసుకుని స్థానిక పోలీస్​ స్టేషన్​కు తరలించారు.

By

Published : Jul 25, 2019, 1:48 PM IST

Updated : Jul 25, 2019, 3:12 PM IST

arrest

సచివాలయం కూల్చివేత, అసెంబ్లీ నిర్మాణంపై అఖిల పక్షం నేతలు చేపట్టిన సచివాలయ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. ఇందిరాపార్క్‌ నుంచి ర్యాలీగా బయలుదేరిన నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలిపే హక్కు తమకు ఉందని పోలీసులతో నేతలు వాగ్వాదానికి దిగారు. ప్రభుత్వ , పోలీసుల తీరును తీవ్రంగా ఖండించారు. అఖిలపక్షనేతలు వివేక్‌, ఆచార్య కోదండరామ్‌, ఎల్‌.రమణ, రావుల చంద్రశేఖర్​ రెడ్డి, చింతల రామచంద్రారెడ్డితోపాటు పలువురు నేతలను అదుపులోకి తీసుకుని స్థానిక పోలీస్​ స్టేషన్​కు తరలించారు.

సచివాలయ ముట్టడికి బయల్దేరిన అఖిలపక్ష నేతల అరెస్టు
Last Updated : Jul 25, 2019, 3:12 PM IST

ABOUT THE AUTHOR

...view details