తెలంగాణ

telangana

ETV Bharat / state

అమరవీరుల స్థూపానికి నేతల నివాళులు

తెలంగాణ ఐదో పడిలో అడుగిడుతన్న సందర్భంగా సంబురాలు అంబరాన్నంటాయి. హైదరాబాద్​ గన్​పార్కు వద్ద అమరవీరుల స్థూపానికి వివిధ పార్టీల నేతలు, ప్రముఖులు నివాళులర్పించారు.

By

Published : Jun 2, 2019, 10:35 AM IST

ప్రముఖుల నివాళి

గన్​పార్కు వద్ద వివిధ పార్టీ నేతల నివాళి

రాష్ట్ర వ్యాప్తంగా అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా సాగుతున్నాయి. హైదారాబాద్​ గన్​పార్కు వద్ద అమర వీరుల స్థూపానికి వివిధ పార్టీల నేతలు నివాళులర్పించారు. కాంగ్రెస్​ సీనియర్​ నేత వి.హనుమంతరావు, లోక్​సత్తా పార్టీ వ్యవస్థాపకుడు జయ ప్రకాశ్​నారాయణ్​, సీపీఐ నేతలు నివాళులర్పించారు. ఎందరో త్యాగధనులు, ఎన్నో ఏళ్ల పోరాట ఫలితమే తెలంగాణ అని నాయకులు కొనియాడారు.

ABOUT THE AUTHOR

...view details