ఇంటర్ ఫలితాల్లో అవకతవకలపై అఖిల పక్షం నిరసన ఇంటర్మీడియట్ ఫలితాల్లో ప్రభుత్వం కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు చేసిందని అఖిలపక్షం నేతలు ఆరోపించారు. ఈ విషయంపై జూన్ 2న సికింద్రాబాద్లోని గాంధీ విగ్రహం వద్ద బాధిత కుటుంబాలతో కలిసి మౌన దీక్ష చేస్తామన్నారు. అధికారులకు కనువిప్పు కలిగేలా ప్రజా, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.
విద్యార్థులపైనే అబాండాలు
ఇంటర్ ఫలితాల్లో అవకతవకలపై అధికారులు విద్యార్థులపైనే అభాండాలు వేస్తున్నారని తెదేపా నేత రావుల చంద్ర శేఖర్రెడ్డి విమర్శించారు. విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఇటీవల ఎన్నికల ఫలితాలతో తెరాస నేతల బేజారయ్యారని అఖిలపక్షం నేతలు ఎద్దేవా చేశారు.
ఇదీ చూడండి : నేనా.. పార్టీ మారతానా? అంతా ఉత్తముచ్చటే!