తెలంగాణ

telangana

ETV Bharat / state

వరంగల్​ ఘటనను ఖండిస్తూ హైదరాబాద్​లో​ ర్యాలీ

రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను నివారించాలని డిమాండ్​ చేస్తూ బషీర్​ బాగ్​లో మహిళా, విద్యార్థి సంఘాలు హైదరాబాద్​లో ప్రదర్శన నిర్వహించాయి. వరంగల్​ ఘటన నిందితున్ని కఠినంగా శిక్షించాలని నాయకులు డిమాండ్​ చేశారు.

By

Published : Jun 20, 2019, 12:58 PM IST

ర్యాలీ

హైదరాబాద్​లోని బషీర్​బాగ్​లో అఖిల భారత మహిళా సాంస్కృతిక సమాఖ్య, అఖిల భారత డెమొక్రటిక్ స్టూడెంట్స్​ ఆర్గనైజేషన్ ప్రదర్శన నిర్వహించారు. రాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాలను నివారించాలని డిమాండ్ చేశారు. వరంగల్​లో తొమ్మిది నెలల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడి, హత్య చేసిన నరహంతకుడు ప్రవీణ్​ను కఠినంగా శిక్షించాలని వారు నినాదాలు చేశారు. పసిపిల్లలపై అత్యాచారాలకు కారణమవుతున్న మద్యం, మాదకద్రవ్యాలు, అశ్లీలత, పోర్నోగ్రఫీలను నిషేధించాలని డిమాండ్ చేశారు.

వరంగల్​ ఘటనను ఖండిస్తూ హైదరాబాద్​లో​ ర్యాలీ

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details