తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనా భయంతో రోడ్డుకు తాడు కట్టారు... అది కాస్తా ఉరి తాడైంది

ప్రజల్లో కరోనా భయం తారస్థాయికి చేరింది. ఎక్కడ వైరస్ సోకుతుందోనని భయపడుతున్నారు. తమ గ్రామంలోకి ఎవరూ రాకుండా రాళ్లు, చెట్లు అడ్డుపెడుతున్నారు. కొన్ని గ్రామాల్లో తాళ్లు అడ్డుకడుతున్నారు. అలా కట్టిన తాడు ఓ వ్యక్తికి ఉరితాడై... ప్రాణాలు బలి తీసుకుంది.

By

Published : Mar 28, 2020, 7:31 PM IST

a man died in guntur on corona fear of villagers
కరోనా భయంతో రోడ్డుకు తాడు కట్టారు... అది కాస్తా ఉరి తాడైంది

ఆంధ్రప్రదేశ్​లోని గుంటూరు జిల్లా బాపట్ల మండలం పూండ్లలో విషాదం చోటు చేసుకుంది. కరోనా భయంతో గ్రామస్థులు కట్టిన తాడు... ఓ వ్యక్తికి యమపాశమైంది. ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఓ వ్యక్తికి గ్రామస్థులు కట్టిన తాడు మెడకు చుట్టుకుంది. ఈ ఘటనలో వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందాడు. మృతుడు కొండుబొట్లవారిపాలెంకు చెందిన సుబ్బారావుగా గుర్తించారు.

కరోనా భయంతో రోడ్డుకు తాడు కట్టారు... అది కాస్తా ఉరి తాడైంది

ABOUT THE AUTHOR

...view details