తెలంగాణ

telangana

By

Published : Feb 15, 2021, 11:42 AM IST

ETV Bharat / state

92 ఏళ్ల వయసులో పంచాయతీ వార్డు సభ్యురాలిగా గెలుపు

92 ఏళ్ల వయసులో పంచాయతీ వార్డు సభ్యురాలిగా ఓ బామ్మ గెలుపొందింది. ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా కడియం మండలంలోని మాధవరాయుడుపాలెం గ్రామంలో ఈ సంఘటన జరిగింది. ప్రత్యర్థిపై 13 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు.

92-years-old-women-won-as-ward-member-in-ap-panchayath-elections-at-kadiyam
92 ఏళ్ల వయసులో పంచాయతీ వార్డు సభ్యురాలిగా గెలుపు

ఆంధ్రప్రదేశ్​లోని తూర్పు గోదావరి జిల్లా కడియం మండలంలోని మాధవరాయుడుపాలెం గ్రామానికి చెందిన గ్రంధి లక్ష్మీనర్సమ్మ 92 ఏళ్ల వయసులో పంచాయతీ వార్డు సభ్యురాలిగా గెలుపొందారు. రెండో విడతలో భాగంగా శనివారం జరిగిన ఎన్నికల్లో 13 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించిన ఈ బామ్మను గ్రామస్థులు ప్రత్యేకంగా అభినందించారు.

ABOUT THE AUTHOR

...view details