తెలంగాణ

telangana

By

Published : Oct 21, 2020, 12:39 PM IST

Updated : Oct 21, 2020, 1:05 PM IST

ETV Bharat / state

దసరా ఉత్సవాల్లో సరస్వతీదేవిగా దుర్గమ్మ దర్శనం

ఆంధ్రప్రదేశ్​లోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఐదో రోజు దసరా ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. సరస్వతిదేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారి జ‌న్మ న‌క్షత్రం కావడం వల్ల దర్శనానికి అధికసంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.

vja
vja

ఏపీలోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గా మల్లేశ్వర దేవస్థానంలో దసరా శరన్నవరాత్రుల ఉత్సవాలు ఐదో రోజూ కన్నుల పండువగా సాగుతున్నాయి. అమ్మవారి జన్మ నక్షత్రమైన బుధవారం సరస్వతీ దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు.

జగన్మాతను దర్శించుకునేందుకు పలు ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. 13 వేల మందికి ఆన్ లైన్​లో టికెట్లు జారీ చేసిన అధికారులు, అప్పటికప్పుడు వచ్చే భక్తుల కోసం 100, 300 రూపాయల టికెట్లను క్యూ లైన్లలో ఇస్తున్నారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి:అన్నపూర్ణాదేవిగా దర్శనమిచ్చిన దుర్గామాత

Last Updated : Oct 21, 2020, 1:05 PM IST

ABOUT THE AUTHOR

...view details