తెలంగాణ

telangana

By

Published : Nov 2, 2020, 5:55 PM IST

ETV Bharat / state

ఆంధ్రప్రదేశ్​లో కొత్తగా 1,916 కరోనా కేసులు

ఏపీలో కొత్తగా 1,916 కరోనా కేసులు నిర్ధారణ కాగా.. 13 మంది బాధితులు మృతి చెందారు. ఈ మేరకు ఏపీ వైద్యారోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 8,27,882కి చేరింది.

1916-new-more-corona-cases-conformed-in-andhrapradesh
ఆంధ్రప్రదేశ్​లో కొత్తగా 1,916 కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్​లో కొత్తగా 1,916 కరోనా కేసులు నమోదయ్యాయి. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 8,27,882కు చేరింది. తాజాగా వైరస్ బారిన పడి 13 మంది మృతి చెందగా... రాష్ట్రవ్యాప్తంగా ఈ సంఖ్య 6,719గా ఉంది.

కొవిడ్ బారిన పడి మరో 3,033 మంది కోలుకోగా... మొత్తం బాధితుల సంఖ్య 7.98 లక్షల మందిగా నమోదైంది. ఏపీలో ప్రస్తుతం 22,538 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు 81.82 లక్షల కొవిడ్ పరీక్షలు నిర్వహించినట్లు పేర్కొంది.

ఆంధ్రప్రదేశ్​లో కొత్తగా 1,916 కరోనా కేసులు

ఇదీ చదవండి:కరోనా సెకండ్​ వేవ్​తో ముప్పు... నిపుణుల హెచ్చరిక

ABOUT THE AUTHOR

...view details